యాప్నగరం

తిరుపతిలో దారుణం.. కరోనా టెస్టుకు వచ్చి రోడ్డుపైనే యువకుడు మృతి

గత మూడు రోజులుగా జ్వరంగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ క్రమంలో కరోనా టెస్టు కోసం సంజీవని బస్సు దగ్గరకు వచ్చిన శేఖర్ అక్కడే కుప్పకూలిపోయాడు.

Samayam Telugu 30 Jul 2020, 3:07 pm
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనం కూడా తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో కరోనా టెస్టు కోసం వచ్చిన యువకుడు పరీక్ష అక్కడే కుప్పకూలాడు. తిరుపతిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కొవిడ్ టెస్టు కోసం వచ్చిన ఓ యువకుడు కోవిడ్ టెస్ట్ బస్సు సంజీవిని వద్దకు వచ్చాడు. దీంతో వెంటనే 108కు ఫోన్ చేశాడు. గంట తర్వాత రావడంతో రుయా ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే లోపు అతడు మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
Samayam Telugu రోడ్డుపై కుప్పకూలిన యువకుడు
man died on road at tirupati


అయితే తన కొడుకు చనిపోయిన విషయం తెలియక..అతని తండ్రి వ్యవహరించిన తీరు అందరిచే కంటతడి పెట్టించింది. కొడుకుకు ఒళ్లు నొప్పి తగ్గించే యత్నం చేస్తూ కన్నబిడ్డు కాళ్లు చేతులు నొక్కుతూ ఆ తండ్రి... అందరినీ కంటతడి పెట్టించాడు. తిరుపతి సప్తగిరి నగర్‌కు చెందిన శేఖర్(32) గత మూడు రోజులుగా ఒళ్లు నొప్పిలు, జ్వరంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా రుయా ఎమర్జెన్సీకి వెళితే అక్కడి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కరోనా టెస్టు ఎక్కడ చేస్తారో కూడా తమకు చెప్పలేదని వాపోయారు. శేఖర్ తండ్రి ఆవేదన చూసి స్థానికులు సైతం చలించిపోయారు.
Read More: ఏపీలో కరోనా కలకలం.. ఒకే కుటుంబంలో 11మందికి పాజిటివ్
మరోవైపు ఏపీలో బుధవారం భారీగా కేసులు నమోదు అయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఒకే రోజు ఏకంగా పదివేల కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 65మంది మృతి చెందారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా నమోదవుతున్న కేసుల సంఖ్య గుండెల్లో రైళ్లు పరిగించేలా చేస్తున్నాయి. దీంతో జనం కూడా కరోనా టెస్టుల విషయంలో ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.