యాప్నగరం

గుంటూరు: 283కు పెరిగిన కరోనా కేసులు.. పోలీసుల కీలక నిర్ణయం

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గుంటూరు నగరంలో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Samayam Telugu 29 Apr 2020, 2:05 pm
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో మరో 29 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా కేసులు 283కు చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 59 మంది డిశ్చార్జి కాగా, యాక్టివ్ కేసులు 216 ఉన్నాయి. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది మరణించారు. జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu గుంటూరు నగరం


కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు నగరంలో లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. రెడ్ జోన్ల పరిధిలో పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది విధుల నిర్వహణ తీరును కూడా అధికారులు డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి ఎదరైనా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 283 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో గుంటూరు నగర పరిధిలోనే 143 కేసులు ఉన్నాయి. పోలీసుల ఆంక్షలతో నగరంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు తప్ప ఎవరూ బయట కనిపించడం లేదు. దీంతో రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.