యాప్నగరం

కరోనాను జయించిన ఏపీ పోలీస్ శాఖ.. 45 మంది డిశ్చార్జి

కరోనా వైరస్ బారినపడ్డ 45 మంది పోలీసులు పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

Samayam Telugu 29 May 2020, 3:01 pm
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అనితరమైన సేవలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ రోజు కోవిడ్ నియంత్రణలో భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందంటే, దానికి పోలీసు సిబ్బందితో పాటు మిగతా ఫ్రంట్ వారియర్స్ త్యాగాలు కారణమని చెప్పక తప్పదని పేర్కొన్నారు. ఈ క్రమంలో 45 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని, వీరందరూ వైరస్ మహమ్మారిని జయించి డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు.
Samayam Telugu పోలీసుల కరోనా డ్యూటీ


కోవిడ్ పై యుద్ధంలో పోలీసు సిబ్బంది అంకిత భావంతో పని చేయడంలో వారి కుటుంబ సభ్యుల సహకారమూ లేకపోలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. విశ్వ మానవతా సంస్థ సహకారంతో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ కౌన్సెలింగ్, ఆన్‌లైన్‌న్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.

Please Vote: పోల్: జగన్ ఏడాది పాలన ఎలా ఉంది?

పోలీసు శాఖ తీసుకున్న చర్యలు వల్ల గత రెండు వారాలుగా పోలీసు సిబ్బంది ఎవరికీ వ్యాధి సోకలేదని డీజీపీ సవాంగ్ వెల్లడించారు. కరోనా సోకిన విషయాన్ని ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో హిందూపురానికి చెందిన ఏఎస్ఐ హాబీబూల్లా మరణించారని డీజీపీ సవాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాబీబుల్లా కుటుంబానికి 50 లక్షలు ఆర్థిక సహాయం అందించి, దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి సహాయాన్ని పోలీసు శాఖ ఎప్పటికీ మరువదన్నారు. కరోన వ్యాప్తిని నివారించే క్రమంలో వ్యాధి బారిన పడి కోలుకున్న పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు డీజీపీ సవాంగ్ అభినందనలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.