యాప్నగరం

స్టేడియాల్లో రైతు బజార్లు.. జగన్ సర్కార్ వినూత్న ఆలోచన

Covid 19 in AP: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో రైతుబజార్లను స్టేడియంల్లో ఏర్పాటు చేశారు.

Samayam Telugu 25 Mar 2020, 6:23 pm
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం వీలైనన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జనాలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న రైతు బజార్లను వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే జనాలను సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా విజయవాడలో మున్సిపల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu rythu bazar 3


రైతు బజార్లలో స్థలం తక్కువగా ఉండటం వల్ల జనాలు ఒకే చోట ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్టేడియంలో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. బెజవాడలోని అజిత్ సింగ్ నగర్, పాయకాపురంలోని రైతు బజార్‌ను బసవపున్నయ్య స్టేడియానికి మార్చారు. ఈ మేరకు విజయవాడ వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ ట్వీట్ చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించడం కోసం విజయవాడలోని అన్ని రైతు మార్కెట్లు ఇలాగే బహిరంగ ప్రదేశాలకు మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరారు.

అలాగే ప్రజలు సామాజిక దూరం పాటించడం కోసం స్టేడియంలో మార్కింగ్ సైతం వేశారు. అలాగే కూరగాయలు అమ్మే వ్యక్తికి కొనుగోలుదారుకు సైతం దూరం పాటించే విధంగా మార్కింగ్ చేశారు. ఈ విధానాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.