యాప్నగరం

Tirumala Closed: చరిత్రలో తొలిసారి తిరుమల దర్శనం మూసివేత

తిరుమల శ్రీనివాసుడిపై కరోనా ప్రభావం పడింది. దీంతో తిరుమల ఆలయంలో భక్తులకు దర్శనాన్ని నిలిపేయాలని నిర్ణయించారు. గ్రహణం వేళల్లో మినహా తిరుమల ఆలయాన్ని మూసివేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Samayam Telugu 19 Mar 2020, 9:57 pm
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలపైనా పడింది. కోవిడ్ ప్రభావంతో చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. గ్రహణాల సమయంలో ప్రధాన ఆలయాన్ని మూసివేసినప్పటికీ.. నడక మార్గాన్ని మాత్రం ఇప్పటి వరకూ మూసివేయలేదు. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తిరుమల ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. కరోనా ప్రభావంతో అలిపిరి గేట్లను, అలిపిరి చెక్ పోస్టును అధికారులు మూసివేశారు.
Samayam Telugu tirumalaa


తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తున్నామని.. స్వామివారికి పూజలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ఆలయాల్లోనూ భక్తుల దర్శనాన్ని మూసివేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

కరోనా ప్రభావంతో షిర్డీ ఆలయాన్ని మూసివేస్తూ షిర్డీ సాయిబాబా సంస్థాన్ బోర్డు మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ ఎఫెక్ట్‌తో భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలను భక్తులు లేకుండానే నిర్వహిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.