యాప్నగరం

కరోనా ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ప్రభావంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు వేచి ఉండే పద్దతికి స్వస్తి పలికి, టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించాలని నిర్ణయించింది.

Samayam Telugu 14 Mar 2020, 6:33 pm
దేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపించాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు గుంపుగా వేచి ఉంటే, కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu tirumala temple


Also Read: కరోనాపై వాస్తవాలివే.. ఏపీ సర్కార్‌ బులెటెన్‌ విడుదల

సీతారాముల కళ్యాణం రద్దు
కరోనా ప్రభావం నేపథ్యంలో కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. అలాగే ముంబైలోని శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేదీ మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కాగా, ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవ, వసతి బుకింగ్‌లను రద్దు చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించిన విషయం తెలిసిందే.

Also Read: కరోనా ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.