యాప్నగరం

ఒంగోలులో విషాదం.. ఆస్పత్రి భవనం పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

రాధాకృష్ణా రెడ్డి మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి స్థానింకగా కరోనా పరీక్షలు నిర్వహించారు. అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో కుటుంబసభ్యులు ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.

Samayam Telugu 10 Aug 2020, 11:00 am
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు జనాల్ని భయపెడుతున్నాయి. ఇక ఆస్పత్రులు కూడా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇక పాజిటివ్ తేలినవారు మానసికంగా ధైర్యంగా ఉండాలని డాక్టర్లు నిపుణులు కోరుతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా భయంతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ఘటనలు జరిగాయి.. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన జరిగింది. కరోనా రోగి భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
Samayam Telugu ఒంగోలులో విషాదం


మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రాధాకృష్ణా రెడ్డి మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడికి స్థానింకగా కరోనా పరీక్షలు నిర్వహించారు. అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో కుటుంబసభ్యులు ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు.. అక్కడ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్‌లోని మేల్ రెసిడెన్సీ క్వార్టర్స్ నుండి ఎక్స్ రే కోసం తీసుకు వెళ్తుండగా.. ఆస్పత్రి మూడవ అంతస్థుపై నుండి దూకి బట్టగిరి రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మానసిక స్థితి సరిగా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఆస్పత్రి సిబ్బంది షాకయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.