యాప్నగరం

తాడేపల్లిలో తొలి పాజిటివ్ కేసు.. కరోనా బఫర్ జోన్‌లో సీఎం జగన్ నివాసం!

తాడేపల్లిలోని డోలాస్ నగర్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 3కి.మీ. వరకు రెడ్‌ జోన్‌గా.. 7 కి.మీ. బఫర్‌ జోన్‌గా ప్రకటించారు అధికారులు.. మార్కింగ్‌ వేశారు. సీఎం జగన్‌ నివాసం ఉంటున్న భరతమాత కూడలి ప్రాంతం బఫర్‌ జోన్‌లో..

Samayam Telugu 17 Apr 2020, 8:01 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం కరోనా బఫర్ జోన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో హైరిస్క్‌ జోన్‌గా ప్రకటించారు. 3కి.మీ. వరకు రెడ్‌ జోన్‌గా.. 7 కి.మీ. బఫర్‌ జోన్‌గా ప్రకటించారు అధికారులు.. మార్కింగ్‌ వేశారు. సీఎం జగన్‌ నివాసం ఉంటున్న భరతమాత కూడలి ప్రాంతం బఫర్‌ జోన్‌లో ఉన్నట్లు సమాచారం.
Samayam Telugu tadepalli


Read Also: 3 నెలల గడువు ఇచ్చేది లేదు.. జగన్ సర్కార్‌కు హైకోర్టు షాక్

తాడేపల్లిలోని డోలాస్ నగర్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మంగళగిరి కమర్షియల్‌ టాక్సెస్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. తాడేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ నివాసం ఉంటున్నాడు. అతడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తేలింది. ఆ అపార్టుమెంట్‌లో వ్యక్తులు బయటకు రాకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. అపార్టుమెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్‌.. ఇళ్లలో పనిచేసే వారి వివరాలు సేకరించి పలువురిని క్వారెంటైన్‌‌కు తరలించారు. ఆ ప్రాంతంవైపు ఎవర్నీ వెళ్లనీయకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

Also Read: టీడీపీని ఇరుకున పెట్టేలా వైసీపీ వ్యూహం.. కొత్త అస్త్రం రెడీ!

అపార్ట్‌మెంట్‌కి చుట్టుపక్కల ఓ కిలోమీటర్ వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం, చుట్టుప్రక్కల గ్రామాలను మూడు జోన్లుగా విభజించారు. మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఏడు కిలో మీటర్ల పరిధిని బఫర్ జోన్ గా ప్రకటించారు. ఉద్యోగి ఃకాంటాక్టుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.