యాప్నగరం

ఏపీలో 13కు పెరిగిన కరోనా కేసులు.. గుంటూరులో రెండోది..

Coronavirus in Vizag: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13కు పెరిగాయి. శుక్రవారం విశాఖపట్నంలో ఒకటి, గుంటూరులో మరొక కేసు నమోదయ్యాయి.

Samayam Telugu 27 Mar 2020, 10:14 pm
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరో రెండు కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరింది. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా కుటుంబ సభ్యులు ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. విశాఖలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.
Samayam Telugu corona


అలాగే గుంటూరులో ఇప్పటికే కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు వ్యక్తి ఢిల్లీలో ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొని రాగా, అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడితో సన్నిహితంగా మెలిగిన మహిళకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 406 మంది కరోనా అనుమానితులుకు కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 317 మందికి నెగిటివ్‌ వచ్చిందని.. 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. మిగిలిన వారికి సంబంధించిన రిపోర్ట్స్‌ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో విశాఖలో నాలుగు, విజయవాడలో మూడు, గుంటూరులో రెండు, నెల్లూరులో ఒకటి, ప్రకాశంలో ఒకటి, తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, చిత్తూరు జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం 13 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.