యాప్నగరం

సీఎం జగన్ ఇంటి సమీపంలో కరోనా కేసులు.. ఇద్దరు వాలంటీర్లకు పాజిటివ్

తాడేపల్లి ఎన్టీఆర్‌ కరకట్ట, ఉండవల్లి కూడలి, క్రిస్టియన్‌ పేటలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు ఉన్నారు. ఇద్దరు వాలంటీర్లుమూడు రోజుల క్రితం తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు.

Samayam Telugu 4 Jun 2020, 6:19 pm
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి సమీపంలో కరోనా కేసులు నమోదు కావడం కలకలంరేపింది. సీఎం నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లి ఎన్టీఆర్‌ కరకట్ట, ఉండవల్లి కూడలి, క్రిస్టియన్‌ పేటలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు ఉన్నారు. ఇద్దరు వాలంటీర్లుమూడు రోజుల క్రితం తాడేపల్లిలోని వివిధ ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో అధికారులు శానిటేషన్‌ చేపట్టారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే పాజిటివ్ కేసులు బయటపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
Samayam Telugu సీఎం జగన్ నివాసం (File Photo)


గతంలో కూడా తాడేపల్లిలో కేసులు నమోదుకాగా.. తాజాగా వాలంటీర్లకు కరోనా వైరస్ సోకడం కలకలంరేపింది. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తాడేపల్లి మండలం పరిధిలో ఉండవల్లిలో కూడా మరో పాజిటివ్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి ఉండే ప్రాంతంలో ఇన్ని కేసులు ఉండడంతో అధికారులు హడలిపోతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.