యాప్నగరం

ఏపీలో మరో 4 కరోనా కేసులు, మొత్తం 44.. విశాఖలో హైఅలర్ట్

Coronavirus Cases in Andhra Pradesh: ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44కు చేరుకున్నాయి.

Samayam Telugu 31 Mar 2020, 10:05 pm
ఏపీలో మరో నాలుగు కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 21 మందికి కోవిడ్ సోకింది. దీంతో సోమవారం వరకు 23గా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా 44కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Samayam Telugu pjimage - 2020-03-31T215625.634


రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత నాలుగు కొత్త కొవిడ్-19 పోజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నాలుగు కేసులు విశాఖపట్నం నగరంలోనే నమోదైనట్లు ప్రకటించింది. వీరందరూ ఢిల్లీలో జరిగిన మతపరమైన సమ్మేళనంలో పాల్గొన్నట్లు వెల్లడించింది. ఈ నాలుగు కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కాగా, ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో అధిక శాతం ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారే కావడం గమనార్హం. దీంతో ఆ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలైంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వివరాలు చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సైతం కోరారు.

జిల్లాల వారీగా నమోదైన కేసులు
సంఖ్యజిల్లాకరోనా కేసులురికవరీ అయిన వారు
1ప్రకాశం11
2విశాఖపట్నం101
3గుంటూరు9
4కృష్ణా5
5తూర్పు గోదావరి4
6అనంతపురం2
7చిత్తూరు1
8కర్నూలు1
9నెల్లూరు11
10శ్రీకాకుళం0
11విజయనగరం0
12పశ్చిమ గోదావరి0
13వైఎస్సార్ కడప0
మొత్తం442

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.