యాప్నగరం

ఏపీలో కరోనా వైరస్ కలకలం.. చైనా నుంచి అవనిగడ్డ వచ్చిన..

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. హైదరాబాద్‌లో కరోనా వైరస్ రూమర్లు కలకలం సృష్టించగా.. తాజాగా ఆ రూమర్లు ఆంధ్రాకు పాకాయి.

Samayam Telugu 30 Jan 2020, 1:13 pm
కరోనా వైరస్ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలో తీవ్రతరమైన ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకూ 170 మంది ప్రాణాలు కోల్పోగా.. 7 వేల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. మనకు పొరుగున ఉన్న టిబెట్‌లోనూ కరోనా వైరస్ కేసు నమోదైంది. ఈ వైరస్ 17 దేశాలకు వ్యాపించిందనే వార్త ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లోనూ కరోనా వైరస్ కలకలం రేగిన సంగతి తెలిసిందే. అనుమానితులకు చికిత్స అందించడం కోసం గాంధీ హాస్పిటల్‌తోపాటు, ఫీవర్ హాస్పిటల్, ఛాతి హాస్పిటల్స్‌లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.
Samayam Telugu corona virus


తాజాగా ఏపీలోనూ కరోనా వైరస్ కలకలం రేపింది. చైనా నుంచి వచ్చిన ఓ స్టూడెంట్‌కు కరోనా వైరస్ సోకిందనే ప్రచారం జనాలను భయపెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. అవని గడ్డకు చెందిన ఓ యువతి చైనాలో ఎంబీబీఎస్ చదువుతోంది. సంక్రాంతి పండుగ కోసం జనవరి 12న ఆమె సొంతూరు వచ్చింది. కరోనా వైరస్ విషయమై వైద్యారోగ్య శాఖ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. చైనా నుంచి ఎవరైనా వస్తే వెంటనే సమాచారం పంపాలని సూచించారు.

సదరు విద్యార్థిని వచ్చిన విషయం తెలపగా.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెలో కరోనా వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని తేల్చారు. కరోనా వైరస్‌కు సంబంధించిన పుకార్లను ఎవరూ నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.