యాప్నగరం

కర్నూలు జిల్లా: నాటు బాంబుల పేలుడు కలకలం.. ఒకరి మృతి, మాజీ ఎమ్మెల్యే సొంత ఊరిలో

ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. కేసు నమోదు చేశారు. స్కూల్ పక్కన నాటుబాంబులు ఎవరు పెట్టారు.. ఎందుకోసం ఉంచారు.. ఎక్కడ తయారు చేశారు.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 16 Nov 2020, 11:01 am
కర్నూలు జిల్లాలో నాటు బాంబుల పేలుడు కలకలం రేపింది. అవుకు మండలం చెన్నంపల్లిలో స్కూల్ పక్కన గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు దాచారు.. అటు వైపుగా వెళ్లిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి కుమార్ బాంబును ఆడుకునే బాలుగా భావించాడు. ఆ బాంబుతో ఆడుకుంటున్న సమయంలో పేలి కుమార్‌కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాలుడ్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలంరేగింది.
Samayam Telugu నాటు బాంబులు (File Photo)


ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.. కేసు నమోదు చేశారు. స్కూల్ పక్కన నాటుబాంబులు ఎవరు పెట్టారు.. ఎందుకోసం ఉంచారు.. ఎక్కడ తయారు చేశారు.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నంపల్లి మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్ధసారధి రెడ్డి స్వగ్రామం. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.