యాప్నగరం

కరోనా భయం.. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వరకు కర్ఫ్యూ

కొందరు పనిపాటా లేకున్న బైకులపై రోడ్లపై తిరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారు. అలాంటివారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నామంటున్నారు. కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే అనుమతి ఇస్తామంటున్నారు.

Samayam Telugu 19 Jul 2020, 12:48 pm
ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. శనివారం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగువేల కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల మాత్ర ప్రజలు ఏ మాత్రం కోవిడ్ నిబంధనల్ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు కర్ఫ్యూ విధించారు. శనివారం జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అనవసరంగా బయట తిరుగుతున్న వారిపై కేసు నమోదు చేస్తామని అమలాపురం డి ఎస్ పి షేక్ బాషా హెచ్చరించారు.
Samayam Telugu కర్ఫ్యూ (ఫైల్ ఫోటో)
curfew file photo


జిల్లా కలెక్టర్ కర్ఫ్యూ విధించడంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పరిస్థితిని డి.ఎస్.పి పర్యవేక్షిస్తున్నారు. రావులపాలెం వచ్చిన ఆయన మాట్లాడుతూ అమలాపురం డివిజన్ లోని అన్ని మండలాల లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. పదేపదే చెబుతున్న కొంతమంది యువత ద్విచక్ర వాహనాలపై రోడ్డు మీదికి వస్తున్నారని అటువంటి వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Read More: జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ.. ఈసారి మరో విన్నపం
సోమవారం ఉదయం 6 గంటల వరకు ఎవరు దుకాణాలు తెరువ కూడదని తెరిచినట్లు తెలిస్తే వాటిని సీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. కొందరి అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తెలిపే సూచనలను ప్రతి ఒక్కరు పాటిస్తూ సహకరించాలన్నారు. బయటికి వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కులు లేకుండా ఎవరైనా బయటకు వస్తే వారిపై కేసులు సైతం నమోదు చేస్తామన్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.