యాప్నగరం

ఇది కుల ఘర్షణ కాదు, ప్రభుత్వం మీదున్న వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది: నారాయణ

CPI Narayana: కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో చెలరేగిన హింసపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురింపించారు. ఈ ఘటన ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తే ఇలాంటి ఉద్యమాలే వస్తాయని అన్నారు. జనం ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తిరగబడతారన్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 25 May 2022, 8:48 pm

ప్రధానాంశాలు:

  • కోనసీమ జిల్లా పేరు మార్పు ఘటనపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు.
  • ఇది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని వ్యాఖ్య.
  • ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ జగన్ సర్కార్‌కు సూచన చేశారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కె నారాయణ
K Narayana (CPI) fires on YS Jagan government over Konaseema name change issue
కోనసీమ జిల్లాకు ముందే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండేవి కావని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నారు. దీన్ని కేవలం కుల ఘర్షణగా మాత్రమే చూడలేమని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే కోనసీమ భగ్గుమందని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం (మే 25) ఓ వీడియోను విడుదల చేశారు.
‘కోనసీమ జిల్లా వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీన్ని అక్కడున్న కుల ఘర్షణగా చూడటానికి వీల్లేదు. ఓవరాల్‌గా ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఇది ప్రతిబింబిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించే పద్ధతిలో ఉద్యమాలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షాలను లేకుండా చేస్తారో, ప్రతిపక్షాలకు సంబంధించిన భావాలు లేకుండా చేస్తారో ఇలాంటి ఉద్యమాలు వస్తాయి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తిరగబడతారు’ అని నారాయణ అన్నారు.

జిల్లాల విభజన సమయంలోనే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ పట్టించుకోకుండా ఊగిసలాట ధోరణిలో వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నారాయణ అన్నారు. చివరికిది మంత్రి విశ్వరూప్ ఇంటి దహనం వరకు వెళ్లిందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక ఉద్యమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని సీపీఐ నారాయణ అన్నారు. ఏ విషయంలోనైనా స్పష్టత ప్రదర్శించే సీఎం జగన్.. ఇలా ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. ‘అనేక జిల్లాల్లో పేర్ల విషయంలో వివాదాలొచ్చినా ఆ సమయంలో మొండిగా వ్యవహరించి ఇప్పుడెందుకు రాజీపడ్డారు? ఓట్లు, రాజకీయ ఎత్తుగడలతో సంకుచిత వైఖరిని ప్రదర్శించారు. ఫలితంగానే కోనసీమలో ఘర్షణలు వచ్చామి’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు నారాయణ.

ఈ విషయంలో ఆత్మస్తుతి, పరనింద పనికి రాదని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి నారాయణ సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగిస్తే ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని నారాయణ హితవు పలికారు.

Also Read:

మనసు మరొకరిపై.. పెళ్లి బావతో, ప్రేమజంట కథ విషాదాంతం

కులాల ఓట్ల కోసం రాజకీయ ఆట.. కోనసీమ కుంపటికి కారణమిదేనా?
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.