రాజధానిని అమరావతి నుంచి మార్చే ముఖ్యమంత్రి జగన్కు లేదంటున్నారు సీపీఐ నేత నారాయణ. ‘జగన్ కేపిటల్ పేరుతో కొత్త నాటకం మొదలు పెట్టారని.. అమరావతిని కొనసాగించకపోతే.. రాజీనామా చెయ్యాలి.. రాజధానిని ఎజెండాగా పెట్టి ఎన్నికలకు వెళ్లాలని.. మూడు ముక్కలు చేస్తారో.. ప్రజా తీర్పు వచ్చాక రాజధానిని 20 ముక్కలు చేస్తారో వాళ్ల ఇష్టం’అన్నారు. ప్రజా ఆమోదం లేకుండా రాజధానిని మార్చే రాజకీయ నైతిక హక్కు లేదన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజధాని అంశం, బోస్టన్ కమిటీ నేవేదికపై స్పందించారు.
ఇంట్లో దొంగలు పడితే.. దొంగల్ని పట్టుకోవాలి కాని ఇంటిని మారుస్తారా అని నారాయణ ప్రశ్నించారు. ఇంటి యజమాని దొంగలు పడ్డారని పారిపోయినట్లుగానే.. జగన్ కూడా అమరావతి నుంచి పారిపోతున్నారన్నారు. అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారని.. వాళ్లకు భూములు ఇవ్వలేని పరిస్థితి ఆ భూమిని ఎలా సాగు చేస్తారని ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే వారిపై చర్యలు తీసుకోవచ్చు.. అంతేకాని రాజధానిని మార్చడం సరికాదన్నారు. అమరావతి భూముల్ని సెజ్లుగా మార్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని.. అసెంబ్లీ సెక్రటేరియట్ భార్యాభర్తల బంధం వంటిదని వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగింది.. ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు నారాయణ. జగన్ కూడా 30వేల ఎకరాలు కావాలని.. అద్భుతమైన భవనాలు కట్టాలని అన్నారని గుర్తు చేశారు. అమరావతికి ప్రధానితో శంకుస్థాపన చేశారని.. 13 జిల్లాల ప్రజలు అమరావతి రాజధాని అని నమ్మారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో జగన్ మూడు రాజధానులు అని చెప్పలేదు.. మేనిఫెస్టోలో లేదన్నారు. అలాంటప్పుడు మూడు రాజధానులని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం నవ్వులు పాలయిందని.. జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలాడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కక్షతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని.. ఐఎఎస్ అధికారులు కుటుంబాల్లో రాజధానులు పేరుతో గొడవలు సృష్టిస్తున్నారన్నారు. విశాఖలో టీడీపీ, వైఎస్సార్సీపీ భూ దొంగలు ఉన్నారని.. బోగస్ కమీటీలు పెట్టి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చివరికి అమరావతి శాపమై జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తుందన్నారు.
ఇంట్లో దొంగలు పడితే.. దొంగల్ని పట్టుకోవాలి కాని ఇంటిని మారుస్తారా అని నారాయణ ప్రశ్నించారు. ఇంటి యజమాని దొంగలు పడ్డారని పారిపోయినట్లుగానే.. జగన్ కూడా అమరావతి నుంచి పారిపోతున్నారన్నారు. అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారని.. వాళ్లకు భూములు ఇవ్వలేని పరిస్థితి ఆ భూమిని ఎలా సాగు చేస్తారని ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే వారిపై చర్యలు తీసుకోవచ్చు.. అంతేకాని రాజధానిని మార్చడం సరికాదన్నారు. అమరావతి భూముల్ని సెజ్లుగా మార్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని.. అసెంబ్లీ సెక్రటేరియట్ భార్యాభర్తల బంధం వంటిదని వ్యాఖ్యానించారు.
టీడీపీ హయాంలో అసెంబ్లీలో రాజధానిపై చర్చ జరిగింది.. ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు నారాయణ. జగన్ కూడా 30వేల ఎకరాలు కావాలని.. అద్భుతమైన భవనాలు కట్టాలని అన్నారని గుర్తు చేశారు. అమరావతికి ప్రధానితో శంకుస్థాపన చేశారని.. 13 జిల్లాల ప్రజలు అమరావతి రాజధాని అని నమ్మారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో జగన్ మూడు రాజధానులు అని చెప్పలేదు.. మేనిఫెస్టోలో లేదన్నారు. అలాంటప్పుడు మూడు రాజధానులని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం నవ్వులు పాలయిందని.. జగన్ రాష్ట్రాన్ని మూడు ముక్కలాడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై కక్షతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని.. ఐఎఎస్ అధికారులు కుటుంబాల్లో రాజధానులు పేరుతో గొడవలు సృష్టిస్తున్నారన్నారు. విశాఖలో టీడీపీ, వైఎస్సార్సీపీ భూ దొంగలు ఉన్నారని.. బోగస్ కమీటీలు పెట్టి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చివరికి అమరావతి శాపమై జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తుందన్నారు.