యాప్నగరం

వాళ్లిదర్నీ రక్షించడమే జగన్ సర్కారు ధ్యేయమా.. సీపీఐ నేత ప్రశ్నలు

జగన్ సర్కారుపై సీపీఐ నేత కె.రామకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతబాబు, గోరంట్ల మాధవ్‌ను రక్షించడమే జగన్ సర్కారు ధ్యేయమా అని ప్రశ్నించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 14 Aug 2022, 9:40 pm
Samayam Telugu సీపీఐ నేత రామకృష్ణ
దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రక్షించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నిలదీశారు. ఎమ్మెల్సీ అనంతబాబుపై 90 రోజుల్లోపు ఛార్జ్‌షీట్ వేయకుండా పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

ఈ మేరకు ఆదివారం సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే, ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఎలాంటి విచారణ లేకుండా ఫేక్ అన్నట్లు ఎలా తేల్చారని సూటిగా ప్రశ్నించారు.

మనిషిని చంపి, కారులో డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుపై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ అని రామకృష్ణ నిలదీశారు. అనంతబాబు కేసులో పోలీసులు, ప్రభుత్వ వైఫల్యంపై ఉద్యమిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.