యాప్నగరం

'ఢిల్లీలో ఓ ఎంపీకి ఉన్న విలువ జగన్‌కు లేదా'

ఓ ఎంపీని లోపలకు రమ్మని.. ముఖ్యంత్రిని బయట కూర్చోబెట్టారు. కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన వివరాలు జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు చెప్పడంలేదు. కేంద్రం ఏ డిమాండ్లకు అంగీకరించిందో చెప్పాలి.

Samayam Telugu 23 Oct 2019, 7:48 pm
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు సీపీఐ నేత రామకృష్ణ. ఈ టూర్ వివరాలు గోప్యత ఎందుకని.. అలా చేస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే అన్నారు. సీఎం అఖిలపక్ష భేటీ నిర్వహించి ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పాలన్నారు. రాష్ట్ర సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెప్పుకుంటున్నారని.. ఈ విషయంలో కేంద్రంఎన్ని డిమాండ్లకు అంగీకరించిందో చెప్పాలన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత జగన్ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు.
Samayam Telugu jagan.


Read Also: ఏపీ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌కు ఢిల్లీలో ఎంపీకి ఇచ్చిన విలువ కూడా లేదా అన్నారు రామకృష్ణ. ఎంపీని లోపలకు రమ్మని.. ముఖ్యంత్రిని బయట కూర్చోబెడుతున్నారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షాను కలిసిన వివరాలు జగన్, వైఎస్సార్‌సీపీ నేతలు ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ భేటీ విజయవంతమైందని చెబుతున్నారని.. అంటే అక్కడ మంచి భోజనాలు పెట్టి పంపించారా అంటూ సెటైర్లు పేల్చారు.

ప్రత్యేక హోదా అంశంలో జగన్ వెనకడుగు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు సీపీఐ నేత. చంద్రబాబు హయాంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని.. ఇప్పుడు మళ్లీ అదే జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల్ని కులాల వారీగా విభజించిందని.. వాళ్లకు రైతు భరోసా రాకుండా చేశారని విమర్శించారు. రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.