యాప్నగరం

ప్రధాని మోదీని కాకాపట్టడంలో సీఎం జగన్ దిట్ట, ఎలాగంటే.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 22 Nov 2020, 3:44 pm
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కాకాపట్టడంలో ఏపీ సీఎం జగన్ దిట్ట అని వ్యాఖ్యానించారు. ఎలాగంటే మోదీకి జగన్ నిరంతరం భజన చేస్తుంటారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్రాన్ని సీఎం జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా సీఎం జగన్‌లో మార్పు రాదా అని ప్రశ్నించారు.
Samayam Telugu ప్రధాని మోదీతో సీఎం జగన్


అలాగే పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు నాయకులను పోలవరం సందర్శనకు అనుమతించాలన్నారు. పోలవరంకు వెళుతున్న వారిని ఎందుకు నిర్భంధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అలాగే బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడి గెలిచిందని నారాయణ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసమయ్యే విధంగా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోదీ ప్రధానిగా పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. వామపక్షాలన్నీ ఒక్కటై ఎర్ర జెండాలు చేత పట్టుకుని ముందుకు సాగుదామని.. మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిద్దామని పిలుపునిచ్చారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయబోదని నారాయణ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.