యాప్నగరం

YS Jagan కు అంత ఉలుకెందుకు.. 2 రోజుల ముందే అరెస్టు చేస్తారా.. సీపీఐ నేత ఫైర్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరల పెంపును వెంటనే అరికట్టాలన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 8 May 2022, 11:15 am
ప్రజా ఉద్యమాలు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత ఉలుకని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలను భారీగా పెంచి, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయని విమర్శించారు.
Samayam Telugu సీపీఐ నేత రామకృష్ణ


ఈ నెల 9వ తేదీన సీపీఐ ఛలో అమరావతికి పిలుపునిస్తే రెండు రోజుల ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారని రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం.. సీపీఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. పెంచిన ఆస్తి, చెత్త పన్నులను వెంటనే విరమించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపును అరికట్టాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై అధిక సుంకాల భారాన్ని తగ్గించాలని కోరారు. అలాగే, అరెస్టు చేసిన సీపీఐ నేతలను తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.