యాప్నగరం

జగన్‌ నోరు విప్పరేం.. ఫెవికాల్ రాసుకున్నారా? బృందా కారత్ సంచలన వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా చల్లపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం నేత బృందా కారత్.. ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు గుప్పించారు.

Samayam Telugu 14 Sep 2019, 9:55 am
Samayam Telugu Y-S-Jaganmohan-Reddy-770x433
కృష్ణా జిల్లా చల్లపల్లిలో శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 28వ మహాసభలు, దివంగత గుంటూరు బాపనయ్య శతజయంతి ఉత్సవాల ప్రారంభానికి సీపీఎం నేత బృందా కారత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డికి సామాన్య ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టినా పేదలు, కార్మికులకు ఆయన చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. జగన్‌ విధానం కూడా మోదీ మాదిరిగానే ఉంటోందని, కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

Read Also: పాత కేసు, దోస్తీగా మారిన పాత పగ.. ‘తోట’ వైఎస్ఆర్సీపీ వైపు చూడటానికి కారణాలివేనా?

ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్వయంగా చెప్పినా సీఎం ఎందుకు మాట్లాడటం లేదని బృందా ప్రశ్నించారు. జగన్‌ తన నోటికి ఫెవికాల్‌ రాసుకుని కూర్చున్నారంటూ ఆమె ఎద్దేవా చేశారు. దేశాన్ని కులాలు, మతాల ఆధారంగా చీల్చడానికి మోదీ కుట్రలు పన్నుతున్నారని సీపీఎం నేత ఆరోపించారు.
దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.860 కోట్లు బకాయి పడడం దారుణమని, ఏపీలోని 9 జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించినా ఎలాంటి సహాయం చేయలేదని పేర్కొన్నారు.

Read Also: జగన్‌ విజన్‌‌పై నీతిఆయోగ్ వైస్-ఛైర్మన్ ప్రశంసలు

జమిందారీ వ్యతిరేక భూపోరాటాలకు పురిటిగడ్డ చల్లపల్లి అని, అమరవీరుల త్యాగాలు వృథాగా పోవని బృందా కారత్ అన్నారు. భూపోరాటాల్లో కీలకపాత్ర పోషించిన కమ్యూనిస్టు యోధుడు దివంగత గుంటూరు బాపనయ్య త్యాగాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. భూపోరాటానికి ఈ ప్రాంతాల్లో 43 మంది అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితమే పేదలకు వేలాది ఎకరాల భూపంపిణీ జరిగిందని గుర్తుచేశారు. ఈప్రాంతంలో భూపోరాటంలో తొలిసారిగా ప్రాణత్యాగం చేసిన మహిళ వియమ్మ అని అన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.

Read Also: 100 రోజుల డెడ్‌లైన్, టార్గెట్ జగన్.. పవన్ ఫస్ట్ పంచ్

ఈ సభకు హాజరైన అఖిల భారత కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ విజయరాఘవన్‌ మాట్లాడుతూ దేశంలోనే భూమి లేని పేదలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏపీ అని వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ భూసంస్కరణలను అమలు చేయడం లేదని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.