యాప్నగరం

ఏపీలో విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న వామపక్షాలు

లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ధర్నా చేయకూడదని పోలీసులు అభ్యంతరం చెప్పడంతో పార్టీ కార్యాలయాల్లోనే నేతలు నిరసన చేపట్టారు. ఇటు సీపీఎం నేత సీహెచ్ బాబూరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Samayam Telugu 18 May 2020, 10:47 am
Samayam Telugu సీపీఎం నిరసనలు
ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ సీపీఎం ఆందోళన నిర్వహించింది. లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ధర్నా చేయకూడదని పోలీసులు అభ్యంతరం చెప్పడంతో పార్టీ కార్యాలయాల్లోనే నేతలు నిరసన చేపట్టారు. ఇటు సీపీఎం నేత సీహెచ్ బాబూరావును ఆయన ఇంటి వద్ద.. సీపీఐ నేత రామకృష్ణను ఎంబీభవన్ వద్ద అరెస్ట్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపుతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి బాబూరావును హౌస్ అరెస్ట్ చేశారు. నిరసన తెలియజేసే హక్కు లేకుండా ఇలా అరెస్ట్ చేయడం దారుణమని బాబూరావు మండిపడ్డారు. ఇదంతా నిరంకుశత్వమని.. పోలీసులు అణిచివేసినా విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు.

శాంతియుతంగా పోరాటం చేస్తున్న నేతలను హౌస్‌ అరెస్టు చేయడం దారుణమని సీపీఎం నేత మధు మండిపడ్డారు. శాంతియుత మార్గంలో నిరసన తెలిపే హక్కు తమకు ఉందని.. కానీ పోలీసులు తమ పార్టీ నేతల్ని హౌస్ అరెస్టు చేశారన్నారు. పార్టీ కార్యాలయం లోపల ప్లకార్డులు ప్రదర్శిస్తున్నామని.. పోలీసుల అండతో తమపై అన్యాయంగా కేసులు పెట్టిస్తున్నారని ఫైరయ్యారు. పోలీసులు కూడా ఆలోచించాలని.. అడుగడుగునా ఆంక్షలు పెట్టి అడ్డుకోవడం సరికాదన్నారు.

లాక్‌డౌన్‌ వేళ విద్యుత్‌ ఛార్జీలు పెంచడం అమానుషమని సీపీఎం నేత మధు మండిపడ్డారు. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా జగన్‌ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణను కూడా రాష్ట్రం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.