యాప్నగరం

తారకరత్నకు సోమవారం మరిన్ని పరీక్షలు చేస్తారు: పురందేశ్వరి

Daggubati Purandeswari: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చిన ఆమె తన మేనల్లుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 28 Jan 2023, 8:34 pm
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి (Taraka Ratna Health) విషమంగానే ఉందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. చిన్న వయసులోనే మాసివ్ హార్ట్ ఎటాక్ రావడం ఆందోళనకరమని ఆమె అన్నారు. శనివారం (జనవరి 28) సాయంత్రం ఆమె బెంగళూరులో తారకరత్నకు చికిత్స అందిస్తున్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వచ్చారు. తన మేనల్లుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. తారకరత్నకు ప్రస్తుతం బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. తారకరత్నకు సోమవారం మరిన్ని పరీక్షలు నిర్వహిస్తారని.. ఆ పరీక్షల్లో వచ్చే ఫలితాలను బేరీజు వేసుకొని ఆ తర్వాత ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారని పురందేశ్వరి చెప్పారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ.. కోలుకొని తిరిగొస్తాడనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.
Samayam Telugu tarak ratna
తారకరత్న


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు నారాయణ హృదయాల ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తారకరత్న సతీమణి అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహన కృష్ణ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Photos: తారకరత్న కుటుంబసభ్యులకు చంద్రబాబు పరామర్శ

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని తెలిసి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పతికి చేరుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ అక్కడే ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం రాత్రి జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఆస్పత్రి రానున్నారు. మరోవైపు.. నందమూరి అభిమానులు.. తారకరత్న త్వరగా కోలుకొని తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.



రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.