యాప్నగరం

ఏపీపై అంఫాన్ తుఫాన్ ప్రభావం.. తీర ప్రాంత జిల్లాల్లో అలజడి

మంగళవారం ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్రతో పాటూ తూర్పుగోదావరి జిల్లాల్లో కెరటాలు ఎగసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది.

Samayam Telugu 19 May 2020, 1:18 pm
బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్ ప్రభావం ఏపీపై కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.. అక్కడక్కడా జల్లులు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్రతో పాటూ తూర్పుగోదావరి జిల్లాల్లో కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరం వెంబడి అలలు దూసుకొస్తున్నాయి. తీర ప్రాంత మత్స్యకారుల ఇళ్లల్లోకి నీళ్లు చేరుతున్నాయి. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు.
Samayam Telugu తుఫాన్ ప్రభావం


తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటివానలు కురిసే అవకాశముంది అంటున్నారు. ఉత్తరాంధ్రతో పాటూ తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనూ వానలు పడే ఛాన్స్ ఉంది.

తుఫాన్ బలపడే సమయంలో గాలుల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ సముద్రంవైపు వెళ్లొద్దని సూచించింది. తీర ప్రాంత గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఒడ్డున ఉన్న పడవలు, వలల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అంఫన్‌ తుపాను హెచ్చరిక నేపథ్యంలో అన్ని రెవెన్యూ డివిజన్‌ కేంద్రా ల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఇటు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.