యాప్నగరం

గుంటూరు: తల్లిని చంపిన కూతురు.. ప్లాన్ విని పోలీసులకే దిమ్మతిరిగింది..

ఆస్తి కోసం కూతురు తల్లిని చంపేసిన దారుణ సంఘటన ఏపీలో జరిగింది. హత్య తరువాత తప్పించుకునేందుకు పథకం రచించింది. అయితే పోలీసుల రంగప్రవేశంతో కథ అడ్డం తిరిగి కటకటాల పాలైంది.

Samayam Telugu 31 Oct 2019, 6:13 pm
కన్నతల్లిని కర్కశంగా చంపేసి ఆమె శవాన్ని ఇంట్లో పెట్టుకునే ప్రియుడితో రాసలీలల్లో మునిగితేలిన హైదరాబాద్ కీర్తి ఉదంతం మరువకముందే ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం అమ్మను చంపేసి సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించిన ఓ కూతురు భాగోతం వెలుగుచూసింది. ఈ దారుణ విషాద సంఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది.
Samayam Telugu death.


గుంటూరులోని నగరపాలెం ప్రాంతానికి చెందిన ఆలపాటి లక్ష్మి ఈ రోజు మధ్యాహ్నం హత్యకు గురైంది. తల్లిని కూతురు భార్గవి, ఆమె బావతో కలిసి అత్యంత దారుణంగా చంపేసింది. అందుకు భార్గవి భర్త రామాంజనేయులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తరువాత లక్ష్మిది సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించారు. భార్గవి పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

Also Read: విశాఖలో దారుణం.. యువతిపై గ్యాంగ్‌రేప్

నగరం పాలేనికి చెందిన భార్గవి ఆస్తి కోసం బావ శివరావుతో కలిసి తల్లి లక్ష్మిని చంపేసింది. అనంతరం సాధారణ మృతిగా నమ్మించేలా పథకం రచించింది. పథకం ప్రకారమే హత్య అనంతరం సాధారణ మరణంగా చూపే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి భార్గవిని విచారించడంతో తల్లిని తామే చంపినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆస్తి కోసమే భార్గవి తల్లిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భార్గవి, భర్త రామాంజనేయులతో పాటు బావ శివరావును కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.