యాప్నగరం

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం.. ఎనిమిదికి పెరిగిన మరణాలు

విశాఖ గ్యాస్ లీక్ ఘటన.. ఆర్ ఆర్ వెంకటాపురంలో ముగ్గురు, విశాఖ కేజీహెచ్‌లో ఐదుగురు ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు.

Samayam Telugu 7 May 2020, 9:17 am
విశాఖ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది చనిపోయినట్లు తేలింది.. ఆర్ ఆర్ వెంకటాపురంలో ముగ్గురు, విశాఖ కేజీహెచ్‌లో ఐదుగురు ప్రాణాలు విడిచారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు, అధికారులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. కేజీహెచ్ బాధితులతో నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
Samayam Telugu విశాఖ విషాదం


Read Also: విశాఖలో భయానక పరిస్థితులు.. గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందంటే!

పరిశ్రమ చుట్టుపక్కల వందలాదిమంది అస్వస్థతకు గురికాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. రాత్రివేళ ప్రమాదం జరగడంతో జనాలు చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, స్థానిక యువత తలుపులు పగలగొట్టి బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థత గురవ్వగా.. వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు.. ఘటనను పరిశీలించడానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.