యాప్నగరం

అమలాపురంలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం

హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న యువతిపై కన్నేసిన కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. నిందితుడు హాస్టల్‌లో పని చేస్తున్న ఉద్యోగి బంధువుగా తెలుస్తోంది.

Samayam Telugu 10 Jan 2020, 10:37 pm
నిర్భయ.. దిశ.. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల్లో కనీస భయం కనిపించడం లేదు. ఆడబిడ్డలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఏపీలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినిపై కన్నేసిన కామపిశాచి.. అదనుచూసి తన పశువాంఛ తీర్చుకున్నాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Samayam Telugu rape2


తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మీరియం కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని స్థానికంగా హాస్టల్‌లో ఉండేది. అదే హాస్టల్‌లో పని చేస్తున్న నర్సు సమీప బంధువు రాంబాబు కన్ను ఆ యువతిపై పడింది. అదనుచూసి విద్యార్థినిని బలవంతంగా లాక్కెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Also Read:ఏపీ రాజధానిగా దొనకొండ.? 2014కు ముందు వైసీపీ చాయిస్.! మళ్లీ తెరపైకి..

అత్యాచార ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు తక్షణం స్పందించి నిందితుడు రాంబాబును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఉరిశిక్షలు విధించినా కనీస భయం కలగకపోవడం ఆందోళన కలిగించే అంశం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.