యాప్నగరం

చిత్తూరు: ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలి.. తల్లిదండ్రులూ బీ కేర్‌ఫుల్

గత కొంతకాలంగా ఆన్‌లైన్, పబ్జీ గేమ్స్‌కు బానిసయ్యాడు. రోజూ అదే పనిగా గేమ్స్ ఆడుతున్నాడు. మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.. అతడ్ని గమనించిన తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.

Samayam Telugu 2 Dec 2020, 7:42 am
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం జరిగింది.. ఆన్‌లైన్, పబ్జీ గేమ్స్‌కు మరో యువకుడు బలయ్యాడు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంకి చెందిన బాలకృష్ణారెడ్డి, తులసమ్మ దంపతుల పెద్ద కుమారుడు యోగేష్ స్థానిక డిగ్రీ కాలేజ్‌లో సెకండియర్ చదువుతున్నాడు. గత కొంతకాలంగా ఆన్‌లైన్, పబ్జీ గేమ్స్‌కు బానిసయ్యాడు. రోజూ అదే పనిగా గేమ్స్ ఆడుతున్నాడు. గేమ్స్ ఆడే క్రమంలో తల్లిదండ్రులు తన అకౌంట్‌లో వేసిన రూ.2 లక్షలు ఖర్చు చేశాడు.. ఆ డబ్బు నష్టపోవడంతో మనస్తాపం చెందాడు.
Samayam Telugu ఆన్‌లైన్ గేమ్స్‌కు యువకుడి బలి

మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.. అతడ్ని గమనించిన తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.

లాక్‌డౌన్, కరోనా ప్రభావంతో తీరిక సమయం దొరికింది. దీంతో గేమ్స్ పిచ్చిలో పడి స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, యువత మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల విశాఖ జిల్లాలో కూడా ఓ యువకుడు పబ్జీ మాయలో పిచ్చివాడిగా మారిపోయాడు. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేల్చారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.