యాప్నగరం

సీఏఏ, ఎన్ఆర్‌సీపై ముందుకెళ్తే రాజీనామా.. ఏపీ డిప్యూటీ సీఎం సంచలనం

సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను రాష్ట్రంలో అమలు చేస్తే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పష్టం చేశారు. సీఏఏ, ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సీఎంను ఒప్పిస్తానన్నారు.

Samayam Telugu 15 Feb 2020, 5:46 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఏలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి అంజాద్‌ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా శనివారం కడపలో అంజాద్ బాషా నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
Samayam Telugu amjad basha rally

తనకు పదవులు, పార్టీ ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యని అంజాద్ బాషా స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీపై ముందుకెళ్తే అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమని వెల్లడించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒప్పిస్తానని స్పష్టం చేశారు. ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు సంబంధంచి ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్లబోదని, ఈ విషయంలో తనను నమ్మాలని కోరారు.

Also Read: అమరావతిపై ఒట్టు వేయను.. నేనేమైనా ముఖ్యమంత్రినా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో చేరే దౌర్భాగ్యం పట్టలేదుఎన్డీఏలోకి వైఎస్సార్‌సీపీ చేరుతామని 2011 నుంచి దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. వైసీపీకి ఎన్డీయేలో చేరే దుస్థితి పట్టలేదని వ్యాఖ్యానించారు. ప్రజలు 151 సీట్లు గెలిపించారని.. ఎందుకు బీజేపీలో కలుస్తామని ప్రశ్నించారు. తమది సెక్యులర్ పార్టీ అని, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పెద్ద సంఖ్యలో వైసీపీకి మద్దతుగా నిలిచారన్నారు. వారి మనోభావాలను తమ పార్టీ దృష్టిలో పెట్టుకుంటుందని తెలిపారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.