యాప్నగరం

నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన

చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనితా రాణి వ్యవహారంపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 10 Jun 2020, 6:46 pm
చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణికి అన్యాయం చేశానని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ విసిరారు. తాను దళిత కులానికి చెందినవాడిగా ఉండి.. డాక్టర్ అనితా రాణికి ఎలా అన్యాయం చేస్తానని ప్రశ్నించారు. ఈ విధంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్ అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు మళ్లీ కుల రాజకీయాలను తెరమీదకు తీసుకొస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu నారాయణ స్వామి


చంద్రబాబుకు కుల రాజకీయాలు చేయడమే పనని.. గతంలో కూడా మాల, మాదిగలను విడగొట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నారని నారాయణ స్వామి ధ్వజమెత్తారు. మళ్లీ అదే రకంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వైఖరి ఉందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్‌కు కనీస ఇంగిత జ్ఞానం లేదని మండిపడ్డారు. డాక్టర్ అనితా రాణి వ్యవహారంలో సీఐడీ విచారణ పూర్తయిన వెంటనే అసలు విషయాలు బయటపడతాయని చెప్పుకొచ్చారు.

తాను తప్పు చేసి ఉంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రకటించారు. చంద్రబాబు నిరూపించినా తన పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? అని మంత్రి సవాల్ విసిరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.