యాప్నగరం

మందుబాబులకు డీజీపీ సవాంగ్ సీరియస్ వార్నింగ్.. వీటిని పాటించలేదో..

మందుబాబులు ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. నిర్ణీత సమయాల్లోనే మద్యం దుకాణాలు నడపాలని ఆదేశించారు.

Samayam Telugu 5 May 2020, 11:02 pm
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం కొనుగోలుదారులు ఎవరైనా సరే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించారు. అలాగే నిర్ణీత సమయాల్లోనే మద్యం షాపుల వద్ద క్రమపద్ధతిలో విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు.
Samayam Telugu డీజీపీ గౌతమ్ సవాంగ్


అలాగే మద్యం కొనుగోలుకు వచ్చే వారు సైతం కచ్చితంగా దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. అలాగే ముఖానికి కచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. మద్యం దుకాణల వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ గుంపులుగుంపులుగా చేరకూడదన్నారు.

ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తక్షణమే మద్యం దుకాణాలను మూసివేస్తామని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు. మద్యం సేవించి ఇతరులపై గొడవలకు దిగడం, ప్రశాంతమైన వాతావరణానికి భంగం కల్పించటం వంటివి చేస్తే జాతీయ విపత్తు చట్టం కింద కఠిన చర్యల తీసుకుంటామన్నారు. అలాగే వివాదాలు సృష్టించే వారిపై అనునిత్యం ప్రత్యేక నిఘా ఉంచుతామని డీజీపీ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.