Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాజమండ్రి నగరంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వేడి గాలులకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఇటు వేడి పెరగకుండా.. అధికారులు చర్యలు చేపట్టారు. చల్లటి నీటితో రోడ్లను తడిపారు. ఇటు తిరుపతి నగరంలో ఉదయం నుంచి విపరీతమైన ఎండలతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. గంట పాటు నగరంలో మోస్తారు వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఇటు రాజమండ్రిలో కూడా భారీ ఈదురు గాలులతో వర్షం కురిసింది. మహానాడు ప్రాంగణం అంతా జలమయం అయ్యింది. అప్పటిదాకా ఎండ వేడికి అల్లాడిపోయిన ప్రజలు.. వర్షంతో ఉపశమనం పొందారు.
Andhra Pradesh: ఏపీలో మండుతున్న ఎండలు.. మరోవైపు వానలు!
Andhra Pradesh: ఏపీలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు మాడు పగిలేలా ఎండలు దంచికొట్టాయి. మరోవైపు ఒక్కసారిగా వర్షం కురిసింది. ఎండల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారగా.. వర్షం కారణంగా జలమయం అయ్యాయి.
ప్రధానాంశాలు:
- ఆంధ్రప్రదేశ్లో మండుతున్న ఎండలు
- రాజమండ్రిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- తిరుపతి నగరంలో దంచికొట్టిన వర్షం