యాప్నగరం

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు వెన్నుపోటు పొడిచారు.. రామ్‌గోపాల్ వర్మ

Rgv Tweet On Pawan Kalyan పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం అన్నారు. సీఎం పదవి విషయంలో తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పారు.. తాను ఎవర్నీ పదవి ఇవ్వమని అడగను అన్నారు. అయితే జనసేనాని వ్యాఖ్యలకు దర్శకుడు వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ ఫ్యాన్స్, జనసైనికులు, కాపులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అలాగే తనను తాను కూడా వెన్నపోటు పొడుచుకున్నారంటూ ట్వీట్ చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 12 May 2023, 12:57 pm

ప్రధానాంశాలు:

  • పొత్తులపై పవన్ కళ్యాణ్ కామెంట్స్
  • ట్విట్టర్‌లో స్పందించిన డైరెక్టర్ వర్మ
  • వెన్నుపోటు పొడిచారంటూ సెటైర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Varma On Pawan
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొత్తులపై తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనిచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. అలాగే సీఎం పదవిపైనా తన అభిప్రాయాన్ని చెప్పారు. తనను ముఖ్యమంత్రిని చేయమని ఎవరినీ అడగను అన్నారు. ఈ అన్ని విషయాలలో తాను చాలా క్లియర్‌గా ఉన్నానని చెప్పారు జనసేనాని. పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.
'ఆ రోజు చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా.. దారుణంగా ఈ రోజు పవన్ కళ్యాణ్.. తన జనసైనికులని , తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి. తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు' అంటూ ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్‌పై జనసైనికులు మండిపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం ని చేయాలని టీడీపీనో బీజేపీనో అడగను.. తన సత్తా ఏంటో చూపించి అడుగుతాను అన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ 137 స్థానాల్లో పోటీ చేస్తే.. 7 శాతం ఓట్లు వచ్చాయి అని గుర్తు చేశారు. కొన్ని చోట్ల జనసేనకు 20-30 శాతం ఓట్లు వచ్చాయన్నారు. 2019లో కనీసం 30 నుంచి 40 సీట్లు ఇచ్చి ఉంటే తాను కూడా బలంగా ఉండేవాడిని అన్నారు. అప్పుడు సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం.. తమ బలం మీదే ఆధారపడి స్థానాల సర్దుబాటు ఉంటుంది అన్నారు.
పొత్తుల పై చాలా క్లియర్ గా ఉన్నామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తుల గురించి మాట్లాడుతున్నాను అన్నారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం.. అవసరమైనప్పుడు కచ్చితంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొవాలంటే ప్రధాన పార్టీలు కలిసి నడవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే.. జూన్‌ నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభిస్తాను అన్నారు.

జనసేన ఒక కులం కోసం పనిచేసే పార్టీ కాదన్నారు పవన్ కళ్యాణ్. ఒక కులం కోసమే పనిచేస్తే అది రాజకీయం కాదని.. తమ బలం మీదే ఆధారపడి స్థానాల సర్దుబాటు ఉంటుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో తమకు బలం ఎక్కువగా ఉందని.. కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉందన్నారు. కచ్చితంగా జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.