యాప్నగరం

బస్సులో మహిళా అధికారికి వేధింపులు.. దిశ యాప్‌తో 5 నిమిషాల్లో పోలీసులు

బస్సులో మహిళా ప్రభుత్వ అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రొఫెసర్.. దిశ యాప్‌తో ఐదు నిమిషాల్లో చేరుకున్న పోలీసులు.. బాధితురాలికి సాయం.. నిందితుడి అరెస్ట్.. జీరో ఎఫ్‌ఆర్‌ నమోదు.

Samayam Telugu 11 Feb 2020, 12:14 pm
ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొస్తోంది. అలాగే ఆపదలో ఉన్న మహిళల్ని కాపాడేందుకు దిశ స్పెషల్ యాప్‌ను లాంఛ్ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా యాప్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యాప్ ద్వారా ఆపదలో ఉన్న ఓ ప్రభుత్వ మహిళా అధికారికి సాయం అందింది.
Samayam Telugu disha.


ఏలూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఓ పోకిరీ వేధించాడు. ఆమె విశాఖ నుంచి విజయవాడ వస్తుండగా బస్సులో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ అధికారిణి దిశ తన మొబైల్‌లో దిశ SOS ద్వారా పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే ఏలూరు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందగా.. రంగంలోకి దిగారు. వేకువజామున 4.30 గంటల ప్రాంతంలో.. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే బస్సు దగ్గరకు చేరుకున్నారు.

మహిళా అధికారిని వేధించిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. అధికారిణితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి ప్రొఫెసర్‌గా గుర్తించారు. ఓ ప్రభుత్వ అధికారిణి పట్ల బస్సులో వేధించడం.. ఐదు నిమిషాల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్ట్ చేయడంతో.. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌తో ఇది సాధ్యమైందని మహిళా సంఘాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.