యాప్నగరం

కర్నూలు వైసీపీలో రచ్చ.. ముదిరిన ఆధిపత్య పోరు!

కర్నూలు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేగా తాను ఉండగా మీరెట్లా కార్యకర్తలను చేర్చుకుంటారని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి హఫీజ్ ఖాన్ లేఖ రాశారు.

Samayam Telugu 26 Jan 2020, 11:21 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. కర్నూలు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు బయటపడింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇతర పార్టీల కార్యకర్తలను వైసీపీలోకి చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తానుండగా నియోజకవర్గంలో ఎస్వీకి ఏం పని అని మండిపడ్డారు. ఈ మేరకు ఎస్వీ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.
Samayam Telugu hafeez, sv


‘‘నా అనుమతి లేకుండా పార్టీలో చేరికలు చెల్లవు. సామాన్య కార్యకర్త అంటూనే నాశనం కోరతారా? నువ్వే ఓ కార్యకర్తవు.. ఏ అధికారంతో ఇతర పార్టీల కార్యకర్తలను చేర్చుకుంటావు. నీకు ధైర్యం ఉంటే సొంత నియోజకవర్గం పత్తికొండకు వెళ్లి కార్యకర్తలను చేర్పించుకోవాలి.’’ అని హఫీజ్ ఖాన్ లేఖలో ఘాటుగా స్పందించారు.

ఎస్వీ మోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన తెలుగు దేశం పార్టీలోకి ఫిరాయించారు. దీంతో హఫీజ్ ఖాన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు ఎస్వీ మోహన్‌రెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పట్లో తాను వైసీపీ సామాన్య కార్యకర్తగానే ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.