యాప్నగరం

విశాఖ డెత్ మిస్టరీ: సరదాగా గడుపుదామని ఫ్రెండ్ ఇంటికి.. సాయంత్రానికి శవమై

భీమిలి సుభాష్‌వీధిలో నివాసముంటున్న సతీష్‌ భార్య పుట్టింటికి వెళ్లడంతో సోమవారం సాయంత్రం సరదాగా గడిపేందుకు వెంకటేష్ ఇక్కడికి వచ్చాడు.ఇంటికొచ్చి ఎంత పిలిచినా తలుపులు తీయలేదు.

Samayam Telugu 16 Sep 2020, 8:51 am
విశాఖలో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య కలకలంరేపింది. దివీస్‌ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన స్నేహితుడి నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా కంచికిచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన గణపనేని వెంకటేష్‌ నాలుగేళ్లుగా భీమిలి మండలంలోని దివీస్‌ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. కంపెనీ హాస్టల్లో ఉంటూ.. రోజూ విధులకు హాజరవుతున్నాడు. అతడికి తోటి ఉద్యోగి సతీష్‌తో పరిచయం ఉంది.
Samayam Telugu యువకుడి ఆత్మహత్య


ఈ క్రమంలో భీమిలి సుభాష్‌వీధిలో నివాసముంటున్న సతీష్‌ భార్య పుట్టింటికి వెళ్లడంతో సోమవారం సాయంత్రం సరదాగా గడిపేందుకు వెంకటేష్ ఇక్కడికి వచ్చాడు. మంగళవారం ఉదయం సతీష్‌కు షిఫ్టు డ్యూటీ ఉండటంతో.. వెంకటేష్‌ను ఇంట్లో ఉండమని చెప్పి కంపెనీకి వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికొచ్చి ఎంత పిలిచినా తలుపులు తీయలేదు.. స్థానికుల సహకారంతో బలవంతంగా తలుపు తెరవగా గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించాడు. ఒకింత షాక్‌కు గురైన సతీష్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.