యాప్నగరం

అరాచక శక్తులతో దాడులు చేయిస్తే... కాకినాడ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన

Kakinadaలో జనసైనికులపై రాళ్లు రువ్విన ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అరాచక శక్తులతో దాడి చేయిస్తే జనసైనికులు వెనకడుగు వేస్తారని అనుకోవద్దన్నారు.

Samayam Telugu 12 Jan 2020, 8:04 pm
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన పట్ల అనుచిత పదజాలం వాడటం, తదనంత పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై.. నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన తీరును ప్రతి ఒక్కరూ తప్పు బడుతున్నారన్నారు. తప్పును తప్పని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దని పవన్ స్పష్టం చేశారు.
Samayam Telugu pk


‘‘అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానం. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరేది ఒకటే - పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలి. మా జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటాను’’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాళ్ల దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని జనసేనాని ఆకాంక్షించారు. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలని కోరారు.

Read Also: ఎమ్మెల్యే నివాసం ముట్టడికి జనసైనికుల యత్నం.. కాకినాడలో ఉద్రిక్తత

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అసభ్య పదజాలంతో పవన్‌ను దూషించడాన్ని నిరసిస్తూ.. జనసేన కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా కాకినాడలో వైఎస్ఆర్సీపీ, జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

Read Also: బాబు, పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

జనసేన కార్యకర్తలు కొందరు ద్వారంపూడి ఇంటి వద్దకు చేరుకోగా.. వారిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో స్పెషల్‌ బ్రాంచ్ పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌‌ను అరెస్టు చేయాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.