యాప్నగరం

కరోనాతో పేదల వైద్యుడి మృతి.. కర్నూలు అధికార వర్గాల్లో టెన్షన్

కరోనా వైరస్ కారణంగా కర్నూలులో ఓ డాక్టర్ ప్రాణాలు వదిలారు. దీంతో ఆయన దగ్గర చికిత్స పొందిన వారి వివరాలను సేకరించే పనిలో ప్రభుత్వ వర్గాలు నిమగ్నమయ్యాయి.

Samayam Telugu 16 Apr 2020, 8:01 pm
కరోనా వైరస్ కారణంగా కొద్ది రోజుల వ్యవధిలోనే ఏపీకి చెందిన ఇద్దరు డాక్టర్లు బలయ్యారు. నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ కరోనాకు చికిత్స పొందుతూ చెన్నైలో మరణించిన సంగతి తెలిసిందే. కర్నూలులోనూ ఓ డాక్టర్ కోవిడ్ లక్షణాలతో చనిపోగా.. మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆయన దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్ల వివరాలను అధికారులు ట్రాక్ చేస్తున్నారు.
Samayam Telugu corona death


దాదాపు 40 ఏళ్లుగా వైద్యుడిగా సేవలు అందించిన ఆయన తక్కువ ఫీజు తీసుకొని పేషెంట్లకు చికిత్స అందించేవారు. దీంతో ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యలో పేదలు వచ్చేవారు. దీంతో వారందరి వివరాలను ట్రాక్ చేయడం కష్టం కావడంతో మార్చి 20 నుంచి ఏప్రిల్ 10 మధ్య ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే ఆయన హాస్పిటల్‌లో పని చేసిన వారిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారని సమాచారం.

ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో కర్నూలు రెండో స్థానంలో ఉంది. గురువారం ఉదయం వరకు గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో 113 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు మాత్రమే కోలుకోగా.. మిగతా వాళ్లంతా హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.