యాప్నగరం

శాసన మండలిలో పెరిగిన వైసీపీ బలం.. ఎమ్మెల్సీగా డొక్కా ఏకగ్రీవం

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో బలం పెరిగింది. డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Samayam Telugu 29 Jun 2020, 8:04 pm
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఏపీ శాసన మండలి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. రిటర్నింగ్‌ అధికారి నుంచి ఎమ్మెల్సీగా మాణిక్యవరప్రసాద్‌ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. దీంతో ఇప్పటి వరకు శాసన మండలిలో 9గా ఉన్న వైసీపీ సభ్యుల సంఖ్య 10కి చేరింది.
Samayam Telugu ఎమ్మెల్సీగా ధ్రువపత్రం అందుకుంటున్న డొక్కా మాణిక్యవరప్రసాద్


తెలుగు దేశం పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని మళ్లీ ఆయనతోనే భర్తీ చేయడం విశేషం. నాలుగు రోజుల క్రితమే వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ స్థానానికి ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో మాణిక్యవరప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.