యాప్నగరం

పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష.. ఆ ప్రెస్‌నోట్‌ను నమ్మొద్దు

పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పేరుతో ఫేక్ ప్రెస్‌నోట్. నమ్మొద్దని కోరుతున్న జనసేన పార్టీ.. పవన్ కళ్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రెస్‌నోట్ వైరల్. దీంతో స్పందించిన జనసేన.

Samayam Telugu 4 Nov 2019, 6:22 pm
అధినేత పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందంటి జనసేన పార్టీ. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. జనసైనికులు నమ్మొద్దని కోరింది. జనసేన పార్టీ పేరుతో ఓ తప్పుడు ప్రకటనను వైరల్ చేస్తున్నారని.. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఆ ప్రకటనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అది ఫేక్ ప్రెస్ నోట్ అంటూ జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది.
Samayam Telugu pk.


Read Also: పవన్ అంటే ప్రేమ, అభిమానం: వైసీపీ ఎమ్మెల్యే

ఇంతకీ ఆ ప్రెస్‌నోట్‌లో ఏముంది అంటే
‘ఆమరణ నిరాహార దీక్ష.. భవన నిర్మాణ కార్మికుల మద్దతుగా నిన్న విశాఖలో చేసిన లాంగ్‌ మార్చ్‌ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని తెలుపుకుంటు ప్రభుత్వం రాబోయే రెండు వారాల్లో కార్మికులకు రక్షణ మరియు చనిపోయిన కార్మికులకు ఎక్సగ్రెసియా ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌ 17వ తేదీ అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు జిల్లా అమరావతి నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని ఈ సందర్భముగా తెలియ చేస్తున్నాము’.

See Photo Story: జనసేన లాంగ్ మార్చ్ @ విశాఖపట్నం

‘నవంబర్‌!16 వ తేదీ మంగళగిరి పార్టీ ఆఫీసు లో అధ్యక్షుల వారు అందుబాటులో ఉండటం జరుగుతుంది... నవంబర్‌ 17న జరిగే ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతు గా అన్ని నియోజక వర్గాల్లో ఆమరణ నిరాహారదీక్షలు నాయకులు చేయాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాం.అందుబాటు లో ఉన్న నాయకులు ,కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఆమరణ నిరాహార దీక్షకుమీ వంతు సహకారం ఉండాలని ఆకాంక్షించారు’ప్రెస్ నోట్‌లో ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.