యాప్నగరం

TTD ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జవహర్ రెడ్డి

గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు వెళ్లారు. అక్కడ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జహహర్ రెడ్డి టీటీడీ ఈవోగా బదిలీ అయ్యారు.

Samayam Telugu 10 Oct 2020, 1:00 pm
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన కార్యనిర్వహణాధికారి (ఈవో)గా డాక్టర్‌ జవహర్‌ రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా వరాహస్వామి దర్శనం స్వామి దర్శనం చేసుకొని.. అనంతరం శ్రీవారిని దర్శించకున్నారు. ఆయన శ్రీవారి ఆలయంలో ఈవోగా బాధ్యతలు చేపట్టారు.. జవహర్ రెడ్డి టీటీడీకి 27వ ఈవో. అంతకు ముందు శనివారం వేకువజామున తిరుపతి చేరుకున్న జవహర్‌ రెడ్డి.. అలిపిరి మార్గం నుంచి కాలినడకన బయల్దేరి తిరుమలకు చేరుకున్నారు.
Samayam Telugu జవహర్ రెడ్డి


గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖకు వెళ్లారు. అక్కడ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జహహర్ రెడ్డి టీటీడీ ఈవోగా బదిలీ అయ్యారు. 1993 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమించింది. సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లో ముగిసింది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.