యాప్నగరం

విశాఖలో డ్రగ్స్ కలకలం, బీటెక్ విద్యార్థులే టార్గెట్.. నిందితుల్లో యువతి

విశాఖలో డ్రగ్స్ కలకలం.. బెంగళూరు, గోవాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి దందా చేస్తున్న ముఠా. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల్లో యువతి కూడా ఉంది. విజయవాడకు చెందిన వ్యక్తి రాకెట్ నడుపుతున్నట్లు తేల్చిన పోలీసులు.

Samayam Telugu 24 Oct 2019, 7:45 pm
సాగతీరం నగరం విశాఖలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపింది. డ్రగ్స్ దందా జరుగుతుందని పక్కాగా సమాచారం అందుకున్న పోలీసులు.. డాబా గార్డెన్స్ సమీపంలో దాడులు చేశారు. నలుగుర్ని అరెస్ట్ చేసి.. వారి దగ్గర నుంచి భారీగా మాదక ద్రవ్యాలు ( ఏండిఎంఎ 1 గ్రాం, ఎల్‌ఎస్‌డి బ్లోట్ 02, గంజా జిప్ లాక్ 20, గంజాయి 2 కేజీలు, అల్ఫాజోమ్ టాబ్లెట్స్ 30) స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఈ దందా వెనుక ఉన్న సూత్రదారులు ఎవరనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.
Samayam Telugu drugs.


అరెస్టైన వారిలో నరేంద్ర అలియాస్‌ విక్కీ విజయవాడకు చెందినవాడిగా గుర్తించారు. నరేంద్ర తమిళనాడులో ఆర్‌ఎల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మధురాయ్‌లో మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేశాడు. అతడు గతంలో డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ కేసులో 9 నెలలు రిమాండ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు అరెస్టైన వాళ్లో నరేంద్ర విక్కీ గర్ల్ ఫ్రెండ్ సీతా అలియాస్ సిరి కూడా ఉంది. బెంగళూరు, గోవాకు గంజాయిని సరఫరా చేసి.. అక్కడి నుంచి విశాఖకు డ్రగ్స్ సరఫరా తీసుకొస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ ముఠా ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని హెచ్చరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా డ్రగ్స్ దందా కలకలం రేపింది. దీంతో పోలీసులు నగరంలో మరింత నిఘా పెంచారు.

Image Credit: Getty Images

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.