యాప్నగరం

AP Earthquake: శ్రీకాకుళంలో భూకంపం.. భయంతో జనం పరుగులు

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వార్తలతో జిల్లాలో అలజడి రేగింది.

Samayam Telugu 8 Jan 2020, 6:42 pm
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడంతో కలకలం రేగింది. జిల్లాలోని రాజాం పట్టణం అమ్మవారి కాలనీలో భూమి కంపించింది. భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మూడు సెకన్లపాటు భూమి కంపించినట్లుగా చెబుతున్నారు. రాజాంలో భూకంపంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
Samayam Telugu earthquake


Also Read: వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. నార్కోటెస్టుకు నో చెప్పిన నిందితుడు

గతంలోనూ రాజాంలో భూమి స్వల్పంగా కంపించిన ఘటనలున్నాయి. గతేడాది అక్టోబర్‌లోనూ అమ్మవారి కాలనీలో భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లోనూ గతంలో భూకంపం సంభవించింది. తాజాగా మరోసారి రాజాంలో అతి స్వల్ప భూకంపం నమోదైంది. మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.