యాప్నగరం

బిగ్ అలర్ట్: ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు.. దసరా షెడ్యూట్ ఫిక్స్ చేసుకోండి.. వివరాలివే..!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులను ఈస్ట్ కోస్ట్ రైల్వే అలర్ట్ చేసింది. దసరా సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Samayam Telugu 10 Oct 2021, 5:33 pm
తెలుగు ప్రజలకు ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక సూచనలు చేసింది. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాల్లో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పలు ప్రత్యేక పూజా స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి వెల్లడించారు. విశాఖపట్నం- సికింద్రాబాద్‌ (08579) వీక్లీ అక్టోబర్‌ 13, 20, 27 తేదీల్లో విశాఖపట్నంలో రాత్రి 7కు బయల్దేరి.. మరుసటిరోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో ప్రత్యేక రైలు ((08580) అక్టోబర్‌ 14, 21, 28 తేదీల్లో రాత్రి 7.40కు బయల్దేరి.. మరుసటిరోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
Samayam Telugu రైలు (ప్రతీకాత్మక చిత్రం)


ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..
విశాఖపట్నం– తిరుపతి (08583) వీక్లీ విశాఖపట్నంలో అక్టోబర్‌ 18, 25, నవంబర్‌ ఒకటి తేదీల్లో రాత్రి 7.15 బయలుదేరి.. మరుసటి రోజు ఉద యం 7.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08584) తిరుపతిలో అక్టోబర్‌ 19, 26, నవంబర్‌ 2 తేదీల్లో రాత్రి 9.55 బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం– సికింద్రాబాద్‌ స్పెషల్‌ రైలు (08585) విశాఖపట్నంలో అక్టోబర్‌ 19, 26, నవంబర్‌ 2 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో రైలు (08586) అక్టోబర్‌ 20, 27, నవంబరు 3 తేదీల్లో రాత్రి 9.05 గంటలకు బయలుదేరుతుంది. తెలుగు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏకే త్రిపాఠి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.