యాప్నగరం

గోదావరి వరద.. కోతకు గురవుతున్న వందలాది ఎకరాల భూమి

గోదావరి వరదల కారణంగా వందల ఎకరాల భూమి కోతకు గురువుతోంది. మూడు పంటలు పండే భూమి వరదల కారణంగా కొట్టుకుపోతుండటంతో.. రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 5 Aug 2019, 5:13 pm
ఏటా వర్షాకాలం గోదావరి వరదలు రావడం సాధారణం. ఎగువ ప్రాంతాల్లో ఈ వరదల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. ఉభయగోదావరి జిల్లాలపై మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ధవళేవ్వరం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో వరద కారణంగా లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గోదావరి ప్రవాహం ధాటికి తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో విలువైన భూములు నదిలో కలిసిపోతున్నాయి. ప్రవాహ వేగానికి నదీ తీరంలోని భూములు తీవ్రంగా కోతకు గురవుతున్నాయి.
Samayam Telugu godavari flood effect1


బడుగువాని లంకలోనే గత ఇరవై ఏళ్లల్లో 300 ఎకరాల భూమి కోతకు గురైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గోదావరికి వరద వస్తే చాలు.. తమ కళ్లముందే నీటిలో కలిసి పోతున్న భూముల్ని చూసుకొని అక్కడి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. భూములు కోతకు గురికాకుండా గోడ కట్టాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1977 రికార్డుల ప్రకారం ఆలమూరు మండలం బడుగువానిలంకలో 770 ఎకరాల భూమి గోదావరిలోని గౌతమీ పాయ ఒడ్డున ఉండగా.. ఇప్పుడు కేవలం 420 ఎకరాల భూమి మాత్రమే ఉంది. మిగిలినదంతా గోదావరిలోనే కలిసిపోయింది. ఈ భూములన్ని సారవంతమైన భూములు కావడం గమనార్హం. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్లో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

చదవండి: వరద గోదావరి వారికి లక్షలు తెచ్చిపెడుతోంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.