యాప్నగరం

నాన్నపై ప్రేమతో.. అమ్మను, అక్కను చంపేసిన బాలుడు

నాన్నపై అతిగా ప్రేమను పెంచుకున్న ఓ మైనర్ బాలుడు.. సొంత తల్లిని, అక్కనే చంపేశాడు. తండ్రిని చంపేస్తారనే భయంతో నిద్రిస్తున్న సమయంలో వారిపై సుత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాలివే..

Samayam Telugu 30 Aug 2019, 12:35 pm
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆగస్టు 25న జరిగిన జంట హత్యల కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. తండ్రి మీదున్న ప్రేమతో.. 16 ఏళ్ల కుమారుడే తల్లిని, అక్కను హత్య చేశాడని తేల్చారు. రామచంద్రపురంలో ఆగస్టు 25న జరిగిన బలసా మాధురి, ఆమె కూతురు బలసా కరుణ హత్యకు గురయ్యారు. సుత్తితో మోదీ, కత్తితో పొడిచి వారిని హత్య చేసిన బాలుడు.. తర్వాత తల్లి ఫోన్ తీసుకొని పారిపోయాడు.
Samayam Telugu murder2


హత్యల సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి శ్రీనివాస్‌పై ఉన్న ప్రేమతోనే బాలుడు ఈ హత్యలు చేశాడని పోలీసులు తేల్చారు. శ్రీనివాస్ క్షయతో బాధపడుతుండే వాడు.. దీంతో అతడికి చికిత్స చేయించడం కోసం ఆ బాలుడు చదువు మానేసి పని చేస్తుండేవాడు. అది నచ్చని తల్లి, అక్క అతణ్ని తరచుగా మందలించే వారు.

క్షయతో బాధపడుతున్న శ్రీనివాస్‌.. చికిత్స తీసుకుంటున్న సమయంలో మరో మహిళకు దగ్గరై ఆమెను పెళ్లాడారు. రెండో పెళ్లి చేసుకున్న భర్తను దూరం పెట్టింది. కానీ కుమారుడు మాత్రం తండ్రి కోసం చదువు మానేసి పనికెళ్తున్నాడు. ఈ వ్యవహారం అతడి తల్లికి నచ్చలేదు. దీంతో మీ నాన్న పీడ విరగడైతేనే.. నువ్వు బాగుపడతావంటూ ఆమె పదే పదే అనేది. దీనికి అతడి అక్క కూడా వంత పాడేది.

నాన్నా.. నీ గురించి అమ్మ, అక్క ఇలా అంటున్నారని ఆ బాలుడు తండ్రికి చెప్పాడు. దీంతో చేతబడి చేసి తనను చంపేస్తారేమో అనుమానంతో శ్రీనివాస్.. కొడుక్కి మాయమాటలు చెప్పాడు. అమ్మను, అక్కను హత్య చేయాలని చెప్పాడు. బాలుడు భయపడినప్పటికీ.. చంపాల్సిందేనని తండ్రి పట్టుబట్టడంతో.. నాన్న మీదున్న ప్రేమతో.. నిద్రిస్తోన్న సమయంలో అమ్మను, అక్కను హత్య చేసి పారిపోయానని బాలుడు తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.