యాప్నగరం

NRI Hospital: ఈడీ సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే విషయాలు

NRI Hospital: ఎముకలు కొరికే చలిలో.. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ వేడి పుట్టిస్తోంది. ఇన్నాళ్లు హైదరాబాద్‌లో దడ పుట్టించిన ఈడీ.. ఇప్పుడు ఏపీలోకి మంగళగిరికి షిఫ్ట్ అయ్యింది. కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న అనుమానంతో.. పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు రాజకీయ పార్టీల నేతల హస్తం కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈడీ ఎంట్రీతో ఏపీ హాట్ హాట్‌గా మారింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 2 Dec 2022, 8:51 pm

ప్రధానాంశాలు:

  • మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు
  • ఈడీ సోదాల్లో వెలుగులోకి కీలక విషయాలు
  • ఈడీ ఎంట్రీతో హాట్ హాట్‌గా ఏపీ రాజకీయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu NRI Hospital in Mangalagiri
మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి
NRI Hospital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేస్తున్న వేళ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి, విజయవాడ అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రిల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా.. విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి అక్రమాల్లో.. తెలుగుదేశం (Telugudesam) పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి పాత్ర ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఆస్పత్రి నిర్మాణం కాకుండా రూ. 43 కోట్లు అక్రమ మార్గంలో దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించిన ఆ మాజీమంత్రి.. సుదీర్ఘకాలం ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్‌గా వ్యవహరించారని తెలుస్తోంది. అంతే కాకుండా.. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్‌ఆర్‌ఐ అగ్రిటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేశారని సమాచారం. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి నిధులు దారి మళ్లించేందుకు.. ఎన్‌ఆర్‌ఐ అగ్రిటెక్‌ లిమిటెడ్‌ను ఉపయోగించుకున్నట్లు ఈడీకి ఆధారాలు లభించాయని తెలుస్తోంది. అటు, అక్కినేని మణి ఛైర్ పర్సన్‌గా వ్యవహరించిన అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రి (Akkineni Women Hospital)లోనూ ఈడీ సోదాలు చేసింది. ఇక్కడ అదికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Read LatestAndhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.