యాప్నగరం

టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఆడియో పాఠాలు!

పదో తరగతి విద్యార్థులకు ఇకపై ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు వినిపించాలని అధికారులను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు.

Samayam Telugu 17 Apr 2020, 10:52 pm
రాష్ట్రంలో ఇప్పటికే సప్తగిరి చానల్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్న విద్యా శాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆకాశవాణి ద్వారా విద్యార్థులకు ఆడియో పాఠాలు వినిపించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, ప్రాజెక్టు అధికారులతో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కారణంగా ఒకసారి, కరోనా వైరస్ వల్ల మరోసారి 10వ తరగతి పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు.
Samayam Telugu school


కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున 10వ తరగతి విద్యార్థులకు విద్యా అమృతం పథకం క్రింద ప్రతి రోజు దూరదర్శన్ చానల్‌లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధనా తరగతులు నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఇకపై ఆకాశవాణి ద్వారా కూడా పాఠాలు వినిపించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులను సమీక్షించుకొని 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అలాగే రాష్ట్రంలో నాడు- నేడు పథకం క్రింద అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి సురేష్ చెప్పారు. తల్లిదండ్రుల కమిటీలతో విద్యాశాఖ అధికారులు సమీక్షలు నిర్వహించాలన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే త్వరితగతిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.