యాప్నగరం

కొండచిలువ కలకలం.. ఇళ్ల మధ్య నెమ్మదిగా పాకుతూ..

ఇళ్ల మధ్యకు వచ్చిన కొండచిలువను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఎనిమిది అడుగుల పొడవున్న పామును చూసి భయాందోళనకు గురయ్యారు.

Samayam Telugu 15 Nov 2019, 7:47 pm
నివాసాల మధ్యకు వచ్చిన కొండచిలువ కలకలం రేపింది. ఇళ్ల మధ్యకు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నెమ్మదిగా కదులుతూ ఇళ్ల వైపు వస్తున్న కొండచిలువను చూసిన కాలనీ వాసులు భయంతో పరుగులు తీశారు. అరుపులు, కేకలు వేయడంతో సమీపంలో ఉన్న యువకులు అక్కడికి చేరుకుని కొండచిలువ పనిపట్టారు. కొద్దిసేపు అందరినీ హడలెత్తించిన ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
Samayam Telugu python.


Read Also: జూనియర్ ఎన్టీఆర్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే వంశీపై తీవ్ర ఆగ్రహం

గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొండచిలువ కలకలం రేపింది. స్థానికి సంజీవనగర్ ప్రాంతంలోకి వచ్చిన కొండచిలువను చూసి కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఎనిమిదడుగుల కొండచిలువ ఇళ్ల మధ్యకు నెమ్మదిగా పాకుతూ వస్తుండడాన్ని గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల అరుపులు విన్న కొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. కొండ చిలువను కొట్టి చంపేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.