యాప్నగరం

ఏపీలో ఉప ఎన్నిక సందడి.. ఆగస్టు 24న పోలింగ్

నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13.. ఆగస్టు 24 పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ఉంటాయి. ఖాళీగా ఉన్న మరో స్థానానికి పదవీకాలం ఆరు నెలలలోపే ఉండడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల ఇవ్వలేదు.

Samayam Telugu 6 Aug 2020, 3:44 pm
ఏపీలో ఉప ఎన్నిక సందడి మొదలైంది. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13.. ఆగస్టు 24 పోలింగ్.. అదేరోజు ఓట్ల లెక్కింపు.. ఫలితాలు ఉంటాయి. ఇక మరో పిల్లి సుభాష్ చంద్ర బోస్ రాజీనామాతో ఖాళీగా ఉన్న స్థానానికి పదవీకాలం ఆరు నెలలలోపే ఉండడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల ఇవ్వలేదు. ఈ ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం వైఎస్సార్‌సీపీలో ఆశావహులు పోటీపడుతున్నారు.
Samayam Telugu ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక


జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎంపిక అయ్యారు. దీంతో ఇద్దరూ తమ మంత్రి పదవులతో పాటూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా.. ఆమోదం తెలిపారు. ఇటీవల వారిద్దరు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి మొత్తం నలుగురు రాజ్యసభకు వెళ్లారు.. మోపిదేవి, పిల్లి చంద్రబోస్‌లతో పాటూ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.